బంపర్ సేల్ బొనాంజా స్టార్ట్ ..
ఎన్నికల నగారా కుయ్య్ మంటూ కూత కూసింది. ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రం చిరునామానే మర్చిపోయి..కుంభకర్ణుడి నిద్రపోయి…కొద్దినెలలుగా మాత్రం వామ్ అప్స్ ఫీట్లు చేసేందుకు గోచీలు.. కొంగులు బిగించి ప్రజాక్షేత్రంలో దుమికారు నాయకులనబడే పగటివేషగాళ్ళు. ఒక్కో కులానికీ..వర్గానికీ..మతానికీ ఒక్కోరేటు..ఓటుకు రేటు కట్టే షరాబులు వీరైతే…ఓటరు తన హక్కును ఐదేళ్ల పాటు అమ్ముకునే గులాము. ఎవడి ఓటు పాట వాడిది..ఓటమి మాత్రం ప్రజాస్వామ్యానిదే.
